గవర్నర్ తమిళిసై తండ్రికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స

  • వినికిడి సమస్యతో బాధపడుతున్న గవర్నర్ తండ్రి
  • ఎండోస్కోపీ ద్వారా కర్ణభేరిని పరీక్షించిన వైద్యులు
  • వృద్ధాప్యం వల్ల వినికిడి శక్తి తగ్గిందన్ననిపుణులు
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్ (86)కు గాంధీ ఆసుపత్రిలో నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రిలోని ఈఎన్‌టీ వైద్యులు పరీక్షించారు. ఈఎన్‌టీ చీఫ్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహారావు ఆధ్వరంలో అనంతన్‌కు ఎండోస్కోపీ చేసి కర్ణభేరిని పరిశీలించారు. వినికిడి శక్తి తగ్గడానికి వయసు మీద పడడమే కారణమని వైద్యులు తెలిపారు.
Go Back to Shorts
Governor
Telangana
tamilisai soundararajan
kumari ananthan

More Telugu News